Lions Club: కరీంనగర్, డిసెంబర్ 24 (మన బలగం): కరీంనగర్ నగరానికి చెందిన ప్రముఖ ల్యాప్రో స్కోపిక్ సర్జన్ చెట్టుమల ప్రదీప్ కుమార్కు ఆసియా టుడే ఇండియా ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక ఫ్రైడ్ ఆఫ్ ద నేషన్ అవార్డు రావడం పట్ల మానేరు లయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా కోర్టు వద్ద గలలైఫ్ లైన్ ఆసుపత్రిలో సన్మానించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ మారుమూల ప్రాంత ప్రజలకు వైద్యం అందిస్తున్న తన సేవలను గుర్తించి ఆసియా టుడే ఇండియా వారు అవార్డు గవర్నర్ విష్ణు దేవ్ వర్మ చేత అందించడం హర్షణీయమన్నారు. రాబోవు రోజుల్లో మరింత నాణ్యమైన వైద్యాన్ని నిరుపేదలకు అందించాలని వారు కోరారు. అవార్డు కరీంనగర్కు రావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో వీరు ఇంకా ఎన్నో అవార్డులు అందుకుని పేద ప్రజలకు వైద్యం అందించాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మొదటి జిల్లా గవర్నర్ కోదండరాం, ఆర్ సిగాలి పెళ్లి వెంకట్, అధ్యక్షులు అక్బర్, ప్రధాన కార్యదర్శి ముత్యం శంకర్ గౌడ్, కృష్ణ కిషోర్, రమేశ్ బాబు, చింత సురేష్, జిల్లా కృష్ణ, పెద్దిశరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.