Dharmapuri Municipal Meeting: ధర్మపురి, జనవరి 1 (మన బలగం): ధర్మపురి పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తమ్మ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. సమావేశంలో 11 అంశాలను తీర్మానించినట్లు మున్సిపల్ కమిషనర్ కె.శ్రీనివాస్ తెలిపారు. పారిశుధ్య విభాగంలో వాహనాల మరమ్మతు, గోదావరి నదివద్ద చెత్తకుండీలపై ఫ్లెక్సీలు ఏర్పాటు, ఇంజనీరింగ్ విభాగంలో గేటు వాల్స్ రిపేర్, పైపులైన్ రిపేర్లు, ఎలక్ట్రికల్ స్ట్రీట్ లైట్స్, బ్లీచింగ్ పౌడర్ బస్తాల కొనుగోలు, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ కాలపరిమితి పెంపు, నూతన అంగన్వాడీ సెంటర్ నిర్మాణం తదితర అంశాలు తీర్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె.శ్రీనివాస్, వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, మున్సిపల్ స్టాఫ్ మేనేజర్ గంగాధర్, శానిటరి ఇన్స్పక్టర్ గంగాధర్, కౌన్సిలర్లు అయ్యేరీ వేణుగోపాల్, సంతోషి, కిరణ్ మై, కార్తీక్, సుధాకర్, నాగలక్ష్మి, ఉమా లక్ష్మి, పద్మ, జక్కు పద్మ, అరుణ, అశోక్, యునస్, విజయలక్ష్మి, కో ఆప్షన్ నెంబర్స్ పద్మ, అలీమ్, టీఎంసీ జలెందర్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ మహేశ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.