Couple killed in road accident: ధర్మపురి, జనవరి 1 (మన బలగం): రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందిన ఘటన ధర్మపురి మండలంలో చోటు చేసుకుంది. ధర్మపురి ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రామయ్యపల్లి గ్రామానికి చెందిన కూస చంద్రయ్య, అతని భార్య భాగ్యమ్మ నూతన సంవత్సరం సందర్భంగా రాత్రివేళ ధర్మపురిలోని చర్చిలో ప్రార్థన ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతుడి కోడలు ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.