Alumni Association: నిర్మల్, జనవరి 12 (మన బలగం): పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆనందోత్సాహాల మధ్య ఘనంగా ఆదివారం నిర్వహించుకున్నారు. స్థానిక మయూరి ఇన్లో జీఎస్ఆర్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు 2008-09 అపూర్వ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. 15 సంవత్సరాల తర్వాత విద్యార్థిని విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. వారి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ చదువు చెప్పిన గురువులను సన్మానించారు. ప్రధానోపాధ్యాయులుగా గాంధారి రాజన్న, ఉపాధ్యాయులు శ్రీనివాస్, శ్రీకాంత్, నాగరాజు, శ్రావణ్, ప్రదీప్, సుధీర్, కల్పన, గురువులను సన్మానించారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ డాక్టర్గా సబ్ ఇన్స్పెక్టర్లుగా, రాజకీయ నాయకులుగా వివిధ రంగాల్లో స్థిరపడ్డ వారిని చూసి ఆనందం వ్యక్తం చేశారు. వచ్చే తరాలకు చదువుతోపాటు సంస్కారాన్ని అలవర్చాలని కోరారు. కార్యక్రమ అనంతరం విద్యార్థిని విద్యార్థులు ఆటపాటలతో కార్యక్రమాన్ని అలరించారు.