Accused arrested
Accused arrested

Accused arrested:బాలుడి హత్య కేసులో నిందితుడి అరెస్టు

Accused arrested: నిర్మల్, జనవరి 19 (మన బలగం): నిర్మల్ జిల్లా చిట్యాల గ్రామంలో శనివారం ఉదయం జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ రాజేశ్ మీనా తెలిపారు. చిట్యాల గ్రామ శివారులో చింతల చెరువు వద్ద బండ రాయితో మోడీ రిషి (14)ను హత్య చేసిన అదే గ్రామానికి చెందిన తోకల రాజేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. శనివారం ఉదయం ఇట్టి కేసు వివరాలు తెలుసుకున్న జిల్లా ఎస్పీ డాక్టర్ జి.జానకి షర్మిల స్వయంగా సంఘటన స్థలానికి వెళ్లి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను మరియు సీసీఎస్‌తో పాటు నాలుగు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ఏఎస్పీ రాజేశ్ మీనకు సూచనలు ఇస్తూ ఈ కేసును ఛేదించారు. అదే గ్రామానికి చెందిన తోకల రాజేశ్వర్‌కు హోమోసెక్స్ అలవాటు ఉంది. కామవాంఛ తీర్చుకోవటం కోసం శుక్రవారం అర్ధ రాత్రి సమయంలో చిట్యాల గ్రామనికి చెందిన 13 ఏళ్ల బాలుడిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా తెలుస్తుంది అని భయపడి మత్తులో బాలుడిని అతి కిరాతకంగా బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేసాడు. కేసులో సూచనలు, సలహాలు అందించిన అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఏఎస్పీ రాజేశ్ మీన, ఇన్‌స్పెక్టర్ రామ కృష్ణ, ససీఎస్ ఇన్‌స్పెక్టర్ కృష్ణ, ఎస్ఐలు లింబాద్రి, సందీప్, సాయి కిరణ్, డాగ్ స్క్వాడ్ సిబ్బందిని ఎస్పీ డాక్టర్ జి.జానకి షర్మిల అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *