Inspection of vehicles: ముధోల్, ఫిబ్రవరి 9 (మన బలగం): భైంసా -బాసర జాతీయ రహదారిపై సీఐ మల్లేశ్, పోలీస్ సిబ్బందితో ఆదివారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున వాహనాలను తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అక్రమమద్యం, సరైన పత్రాలు లేకుండా డబ్బులను తీసుకెళ్లినట్లయితే చర్యలు తీసుకుంటామన్నారు. కార్లు, వ్యాన్లతోపాటు ద్విచక్ర వాహనం సైతం క్షుణ్ణంగా పరిశీలించారు. నగదు తీసుకెళ్లేవారు తప్పనిసరిగా రశీదులను వెంట ఉంచుకోవాలన్నారు. ఎన్నికల సందర్భంగా నగదు, బంగారం నియమాలకు విరుద్ధంగా తీసుకెళ్లరాదని అన్నారు. ప్రతి వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.