CM Revanth Reddy: తెలంగాణ బ్యూరో/ మన బలగం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత దామోదరం సంజీవయ్యకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. శుక్రవారం తన కార్యాలయంలో సంజీవయ్య జయంతి సందర్భంగా చిత్రపటానికి పష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. ఈ సందర్భంగా సంజీవయ్య సేవలను సీఎం రేవంత్ కొనియాడారు. స్వతంత్ర భారతంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడిగా సంజీవయ్య నిలిచారని తెలిపారు. అనేక కార్యక్రమాలు చేపట్టి పరిపాలనా దక్షుడిగా పేరు తెచ్చుకున్నాడని తెలిపారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు పటేల్ రమేష్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యులు చారగొండ వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఇతర నేతలు సంజీవయ్యకు నివాళులు అర్పించారు.
