Whip Adluri Laxman Kumar
Whip Adluri Laxman Kumar

Whip Adluri Laxman Kumar: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు కోసం వినతి

Whip Adluri Laxman Kumar: ధర్మపురి, జనవరి 6 (మన బలగం): నేరళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జాజాల రమేశ్ నేరెళ్ల, గోవిందుపల్లె నాయకులతో కలిసి విప్‌కు విన్నవించారు. కార్యక్రమంలో సహకార సంఘం వైస్ చైర్మన్ శేర్ల రాజేశం, డైరెక్టర్ జాజాల లక్ష్మీ వెంకన్న, తాజా మాజీ ఎంపీటీసీ సభ్యులు రెడ్డవేని సత్యం, కాంగ్రెస్ పార్టీ నేరెళ్ళ అధ్యక్షుడు కసారాపు బలగౌడ్, గోవిందుపల్లే అధ్యక్షుడు పురంశెట్టి మల్లేశం, శ్రీ సాంబశివ దేవస్థానం చైర్మన్ కాసరాపు రాజాగౌడ్, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ జంగిలి తిరుపతి, అరబిందో పాఠశాల అధినేత జాజాల రవీందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తొట్ల రాజన్న, నాయకులు పురంశెట్టి సుధాకర్ మడిశెట్టి లక్ష్మణ్, వేముల సురేష్, రైతులు పాల్గొన్నారు.
మూన్నూరుకాపు కళ్యాణ మండపం కోసం నిధులు మంజూరు చేయాలని వినతి
ధర్మపురి మండలంలోని నేరెళ్ళ, గోవిందుపల్లే ఉమ్మడి గ్రామాల మున్నూరుకాపు కళ్యాణ మండపం కోసం నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు నేరెళ్ళ మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు జాజాల రమేశ్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం నాయకులు పురంశెట్టి మల్లేశం, జాజాల రవీందర్, జంగిలి తిరుపతి, పురంశెట్టి సుధాకర్, నేరెళ్ళ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కసారపు బలగౌడ్, మాజీ ఎంపీటీసీ రెడ్డవేని సత్యం, సహకార సంఘం వైస్ చైర్మన్ శేర్ల రాజేశం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట్ల రాజన్న, మాడిశెట్టి లక్ష్మణ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *