Police Community Contact: నిర్మల్, జనవరి 31 (మన బలగం): ప్రజల రక్షణ చర్యల్లో భాగంగానే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని ఖానాపూర్ సీఐ సైదారావు అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని గాంధీ నగర్ కాలనీలో శుక్రవారం రాత్రి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇందులో భాగంగా సరైన అనుమతి పత్రాలు లేని 42 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకొని అనుమతి పత్రాల తనిఖీలు చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించడంతోపాటు వాహన పత్రాలు కలిగి ఉండాలని అదేవిధంగా ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాడ్, కడెం ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి సిబ్బంది ఉన్నారు.