Minister Komati Reddy: తెలంగాణ బ్యూరో /మన బలగం: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని శుక్రవారం ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ మర్యాదపూర్వకంగా కలిశారు. పద్మశ్రీ అవార్డు అందుకోవడం, ఎస్సీ వర్గీకరణను సాధించడంపై మందకృష్ణ మాదిగను మంత్రి శాలువాతో సత్కరించి అభినందించారు. ఎంఆర్పీఎస్ పోరాటం, ఏబీసీడీ వర్గీకరణ వరకు ఇరువురు నేతలు ముప్పై ఏండ్ల పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు.