- సదరం సర్టిఫికెట్ల అవకతవకల్లో తూతూమంత్రంగా విచారణ
- ఫోర్త్ క్లాస్ ఉద్యోగులను తొలగించి చేతులు దులుపుకున్న అధికారులు
- తోలగించామని చేబుతూనే మెడికల్ కాలేజీలో అవకాశం
- సూత్రధారులైన అధికారులపై చర్యలు శూన్యం
Sadaram certificates: కరీంనగర్, మన బలగం: సదరం సర్టిఫికెట్ల అవకతవకలపై సంబంధించిన ప్రధాన సూత్రధారులైన అధికారులను సస్పెండ్ చేయాలని ఏఐవైఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బావండ్లపల్లి యుగేంధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాకు తిక్కుంది మేము చేసే పనులకు ఏమాత్రం లెక్క లేదు.. అన్న చందంగా వ్యవహారం ఉందన్నారు. సదరం సర్టిఫికెట్లలో లక్షల రూపాయల కుంభకోణం జరిగిందని ఫోర్త్ క్లాస్ ఉద్యోగుల నుంచి అధికారుల వరకు విచారణ జరిపించాలని మొదటి నుంచి ఏఐవైఫ్ డిమాండ్ చేస్తుందన్నారు. అధికారులందరూ లక్షల రూపాయలను పప్పుబెల్లంలా పంచుకున్నారని, కంచే చేను మేసిందని ప్రశ్నించారు. పాత్రధారులు, సూత్రధారులు అందరూ ఆ శాఖలోనే ఉన్నారని ఆరోపించారు. ఒక డిపార్ట్మెంట్ వారు తప్పు చేస్తే వేరే డిపార్ట్మెంట్ అధికారితో పూర్తిస్థాయిలో పారదర్శకంగా విచారణ జరిపిస్తారని, కానీ దానికి విరుద్ధంగా ఈ విచారణ జరిగిందన్నారు. నిబంధనల ప్రకారం సదరం క్యాంపు 200 మందికి మాత్రమే స్లాట్ బుకింగ్ విధానం ఉంటుందని, కానీ దానికి భిన్నంగా హుజురాబాద్లో సదరం క్యాంపు ఆకస్మికంగా నిర్వహించడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. అడిషనల్ డిఆర్డిఓ వెంకటేశ్వర్లు నేతృత్వంలో జరిగిన విచారణ కమిటీ గత యేడాది జనవరి 2021 నుంచి 2022 ఫిబ్రవరి వరకు విచారణ జరిపి కలెక్టర్కు నివేదిక సమర్పించిందని, కానీ హుజురాబాద్లో జరిగిన సదరం సర్టిఫికెట్లపై విచారణ ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుప త్రిలో ఇద్దరు కంప్యూటర్ ఆపరేట్లు లక్షల రూపాయలు వసూలు చేశారని, వారితో పాటుగా సంబంధిత అధికారులు కూడా ఉన్నారని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారి వెనుక ఉన్న సూత్రధారులను బయటకు లాగాలన్నారు. సదరం సర్టిఫికెట్లలో లక్షల రూపాయలు చేతులు మారాయని, కానీ అధికారులు ఫోర్త్ క్లాస్ ఉద్యోగులను తొలగించి చేతులు దులుపుకున్నారన్నారు సూత్రధారులను సస్పెండ్ చేసే వరకు వదలేది లేదని యుగేంధర్ హేచ్చారించారు.