Climbing the Himalayas
Climbing the Himalayas

Climbing the Himalayas: రికార్డు సృష్టించిన నిర్మల్‌వాసి

హిమాలయాలు అధిరోహించిన లక్కాకుల ఆదిత్య
Climbing the Himalayas: నిర్మల్, ఫిబ్రవరి 20 (మన బలగం): నిర్మల్ పట్టణంలోని బేస్తవార్‌పేట్‌కు చెందిన లక్కాకుల తుకారాం తనయుడు ఆదిత్య హిమాలయాలు అధిరోహించి చరిత్ర సృష్టించాడు. ఆదిత్య పంజాబ్‌లోని ఎల్‌పీయూ కాలేజీలో ఎంసీఏ చదువుతున్నాడు. ఈ నెల 8వ తేదీన 300 మందితో కలిసి ఆదిత్య హిమాలయ పర్వతారోహణ స్టార్ట్ చేశారు. కేవలం ఏడుగురు మాత్రమే పర్వతారోహణను పూర్తిచేశారు. అందులో నిర్మల్‌కు చెందిన ఆదిత్య ఉండడం ఎంతో గర్వకారణం. ఈ టీమ్‌లో అందరికన్నా ముందుగా ఆదిత్య లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఐదు రాజుల పాటు పర్వతారోహణ కొనసాగింది. ఈ నెల 8న ప్రారంభమైన యాత్ర 12వ తేదీన హిమాలయాల్లోని ఎత్తైన శిఖిరానికి చేరుకున్నారు. హిమాలయాల పర్యటన విజయవంతంగా పూర్తి చేసిన ఆదిత్య తరువాత ఎవరెస్టు శిఖరం ఎక్కడ లక్ష్యమని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *