- సహాయం కోసం ఎదురుచూస్తున్న మల్టీపర్పస్ వర్కర్
- కాలేయ వ్యాధితో దవాఖానలో చేరిన గుగులోత్ కిషన్
save me: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, మార్చి 2 (మన బలగం): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సేవాలాల్ తాండకు చెందిన గుగులోత్ కిషన్ గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు. చాలీచాలని జీతంతో జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. అప్పుల భారం ఎక్కువ కావడంతో తన కుమారుడిని ఉపాధి కోసం దుబాయ్కి పంపాడు. ఈ క్రమంలో కిషన్ కాలేయ వ్యాధి బారిన పడ్డాడు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకున్నాడు. కాలేయ సమస్య రోజురోజుకూ ఎక్కువ కావడంతో అప్పులు చేసి శ్రీమంజునాథ ప్రైవేటు దవాఖానలో చేరాడు. ఒక్క సూదికి తొమ్మిది వేల రూపాయల చొప్పున రోజుకు 20వేల రూపాయలు ఖర్చు చేసి చికిత్స పొందుతున్నాడు. ఇప్పటివరకు రెండు లక్షల రూపాయలు ఖర్చుపెట్టారు. ఇప్పుడు డబ్బులు లేక చాలా ఇబ్బందులతో దినదిన గండంగా మృత్యువుతో పోరాడుతున్నాడు. సహాయం కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక మల్టీ పర్పస్ వర్కర్ను కాపాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కేటీఆర్ తనను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.