- డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో వద్దు
- బీజేపీ పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్
Dharmapuri: ధర్మపురి, మార్చి 3 (మన బలగం): ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ వేదిక మార్పుపై సోమవారం భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవో, సూపరిటెండెంట్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గాజు భాస్కర్ మాట్లాడుతూ, ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దీనిని భక్తులు చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ కార్యక్రమాన్ని చెత్తా చెదరానికి డంపుగా ఉపయోగించే స్థలంలో నిర్వహించడం చాలా బాధాకరమన్నారు. అనేక రకాల చెత్తాచెదారాలతో నిండిన డంప్ యార్డ్ ప్రాంతంలో పశువుల కళేబరాలు, ఎముకలు ఇలాంటివన్నీ ఆ డంప్ యార్డ్ ప్రదేశంలో పడేస్తారని తెలిపారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని దీనిపై పునరాలోచన చేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, అసెంబ్లీ కో- కన్వీనర్ బండారి లక్ష్మణ్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, తిరుమందాస్ సత్యనారాయణ, మండలోజి సూరజ్, అప్ప మల్లేష్, అనంతదాసు నవీన్, వెలగందుల ప్రణీత్, సంగీ రాజేష్, కాశెట్టి మహేష్, కాశెట్టి హరీష్, సంఘీ రాజేష్, అప్పం శ్రీనివాస్, మరియు తదితరులు పాల్గొన్నారు.