Tribal villages: నిర్మల్, మార్చి 27 (మన బలగం): నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని జీడిమాల్య, రాగి దుబ్బనాల గ్రామాలలో నివసిస్తున్న ఆదివాసి గిరిజన గూడాలకు, తండాలకు విద్యుత్ సౌకర్యంలేక గిరిజనులు అడవిమృగాల కంటే హీనంగా చీకట్లో మగ్గుతున్నారు. పాలకులు మారినా మా బతుకులు మారడంలేదని, ఇప్పటికైనా ఈ ప్రజా ప్రభుత్వంలో మా గ్రామాలకు మరియు పంటభూములకు విద్యుత్ సౌకర్యం కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని స్థానిక నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవకు సమస్యలను విన్నవించుకున్నారు. కార్యక్రమంలో ఖానాపూర్ నియోజకవర్గ నాయకుడు బన్సిలాల్ రాటోడ్, ఆదివాసీ గ్రామ పెద్ద ఆరే రాయుడు, తండా నాయక్ గుగ్లావత్ గణేశ్, రాజేందర్, రమేశ్, జల్పత్, చంపత్, ధన్సింగ్, మాలావత్ రమేశ్, ముకుంద్రావు, పర్సురామ్, బాబూలాల్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.