Alumni Association: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివిన పూర్వవిద్యార్థుల సమ్మేళనం ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. 2002-2005 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఒక్కచోట చేరి సందడి చేశారు. దాదాపు 30 మంది మిత్రులు కలిసి ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా తమకు పాఠాలు బోధించి మృతిచెందిన అధ్యాపకులు, మిత్రులకు నివాళులర్పించారు. వంటావార్పు చేసి సహపంక్తి భోజనాలు చేశారు. రోజంతా ఉల్లాసంగా గడిపారు. చాలా ఏళ్ల తరువాత కలుసుకున్న తమ మిత్రులను ఆత్మీయ ఆలింగనాలతో పలకరించుకున్నారు. కళాశాల వీడి 20 ఏళ్లు పూర్తయిన తరువాత కలుసుకున్న వారంతా తమ సాదక బాదలు పంచుకున్నారు. కుటుంబ, ఆర్థిక పరిస్థితులను వెల్లడించారు. తాము చేసే జాబ్స్ గురించి తెలిపారు. సమ్మేళనానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు సైతం హాజరై తమ కళాశాల మిత్రులతో ఉత్సాహంగా గడిపారు. పలువురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించగా, మరికొందరు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. మరికొందరు సొంత వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మిత్రులు అందరూ కలిసి భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకున్నారు. తమ తోటి మిత్రులను ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించేలా ప్లాన్ చేసుకున్నారు.
