PM Modi Meditates At Vivekananda Rock Memorial In Kanyakumari
PM Modi Meditates At Vivekananda Rock Memorial In Kanyakumari

PM Modi: కన్యాకుమారిలోని వివేకానంద మెమోరియల్‌లో 45 గంటల ధ్యానంలో ప్రధాని నరేంద్ర మోడీ

PM Modi: తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోడీ 45 గంటల ధ్యానం కొనసాగుతున్నది. గురువారం సాయంత్రం 6.45కు ధ్యానాన్ని ప్రారంభించిన మోడీ శనివారం సాయంత్రం వరకు కొనసాగిస్తారు. లోక్‌సభ ఎన్నిక ప్రచార పర్వం ముగియడంతో మోడీ రిలాక్స్ మూడ్‌లోకి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. ఇందుకోసం ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా కన్యాకుమారిలోని భగవతి అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఫెర్రీలో వివేకానందుడి విగ్రహాన్ని దర్శించుకున్నారు. ధ్యాన మండపంలో రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందలకు నమస్కరించారు. అనంతరం ధ్యానానికి ఉపక్రమించారు. కాషాయ దుస్తులు ధరించి రుద్రాక్షమాల చేతబూని ధ్యానముద్రలో కూర్చున్నారు. 45 గంటల పాటు ధ్యానం కొనసాగిస్తారు. ధ్యాన సమయంలో ద్రవ ఆహారం మాత్రమే తీసుకుంటారు. కొబ్బరి నీళ్లు, గ్రేప్స్ జూస్ మెనూలో ఉండనున్నాయి. ప్రస్తుతం మోడీ మౌన నిరాహార దీక్షకు సంకల్పించారు. 2019 లోక్‌సభ ఎన్నికలు చివరి దశకు ముందు మోడీ ధ్యానం చేశారు. 2014లో కేదార్‌నాథ్, శివాజీ ప్రతాప్‌గఢ్‌లో పర్యటించారు. స్వామి వివేకానంద 1892లో మూడ్రోజులు ధ్యానం చేసిన ప్రదేశంలో జ్ఞాపకార్థంగా రాక్ మెమోరియల్ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం మోడీ అక్కడే వివేకానంద విగ్రహం ఎదుట ధ్యానానికి కూర్చున్నారు. ధ్యానం కోసం స్వామి వివేకానంద రాక్ మెమోరియల్‌ వెళ్లే ముందు మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *