T20 2024: టీం ఇండియా మిడిలార్దర్ బ్యాట్స్మెన్ కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయర్ అయ్యర్, వికెట్ కీపర్ మరియు బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్కు టీం ఇండియాలో చోటు దక్కకపోవచ్చు. సౌతాఫ్రికా సిరీస్ నుంచి అర్ధంతరంగా వైదొలిగిన ఇషాన్ కిషన్ను, వెన్ను నొప్పితో బాధపడుతూ టీంకు దూరమైన శ్రేయస్ను గాయం అనంతరం డొమెస్టిక్ క్రికెట్ ఆడమని బీసీసీఐ పెద్దలు సూచించారు.
కానీ సెలక్టర్ల ఆదేశాలను పక్కన బెట్టిన శ్రేయస్, ఇషాన్ కిషన్లు డొమెస్టిక్ రంజీ సీజన్లో ఆడలేదు. శ్రేయస్ మాత్రం చివరకు సెమీఫైనల్, ఫైనల్ ముంబయి తరఫున ఆడినా.. పెద్దగా రాణించలేదు. దీంతో టీం ఇండియాలో వీరికి దారులు మూసుకుపోయాయని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇషాన్ కిషన్ పర్సనల్ ప్రాబ్లం అని చెప్పి దుబాయ్ వెళ్లి ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల బీసీసీఐ పెద్దలకు చిర్రెత్తుకొచ్చింది. దీంతో వారు ఒక ప్రకటన విడుదల చేశారు. కచ్చితంగా ఏ క్రికెటర్ అయినా సరే డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందేనని అల్టిమేటం జారీ చేశారు. అయితే ఈ హెచ్చరికల్ని ఇద్దరు క్రికెటర్లు ఏ మాత్రం లెక్క చేయలేదు. ఇషాన్ కిషన్ ముంబయి జట్టు కోసం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు.
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో చాలా మంది యువ ప్రతిభావంతమైన క్రికెటర్లు సత్తా చాటుతున్నారు. ఇలాంటి సమయంలో వీరికి టీ 20 జట్టులో చోటు కష్టమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్లో ఇషాన్ కిషన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఫామ్లోకి వచ్చినా.. శ్రేయస్ అయ్యర్ మాత్రం తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. టీ 20 వరల్డ్ కప్ గెలవాలని కృత నిశ్చయంతో ఉన్న టీం ఇండియాలో ఇప్పటికే తుది జట్టు ఖాయమైపోయినట్లు తెలుస్తుంది. మరి ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను సెలక్టర్లు కరుణిస్తారో లేదో చూడాలి.