Sachin Tendulkar
Sachin Tendulkar

Sachin Tendulkar: సచిన్ చెప్పిన ఫన్నీ స్టోరీ.. భలే ఉంది

Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్ ఇండియా క్రికెట్ గాడ్.. ఆటతోనే ప్రత్యర్థులను సమాధానం చెప్పే సమర్థుడైన క్రికెటర్. 22 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని చివరకు 2011లో వరల్డ్ కప్ సాధించి తనేంటో నిరూపించుకున్నాడు. అయితే కొన్ని సందర్భాల్లో క్రికెట్‌లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్‌లను ఆయన షేర్ చేసుకుంటూ ఉంటాడు.

2000 సంవత్సరంలో జరిగిన సహారా కప్‌లో ఇండియా, పాకిస్థాన్‌లు పాల్గొన్నాయి. జవగళ్ శ్రీనాథ్, కుంబ్లే, వెంకటేశ్ ప్రసాద్ గాయంతో దూరం కాగా.. ఫేస్ బౌలింగ్ విభాగంలో లోటు ఏర్పడటంతో నూతన బౌలర్లుగా దేబశిశ్ మహంతి, హర్విందర్ సింగ్‌లను సెలెక్ట్ చేశారు. ఈ సిరీస్‌లో దేబశిశ్ మహంతి అద్భుతంగా బౌలింగ్ చేసి సయీద్ అన్వర్‌ను నాలుగు సార్లు ఔట్ చేశాడు.

దీంతో సయీద్ అన్వర్ ఓ ఫంక్షన్‌లో కలిసినపుడు దేబశిశ్ మహంతి ‘క్యా బందా హై యార్.. మై బాల్ చోడు.. అందర్ హాతా హై.. మై మారు.. ఔట్ ఓ జాయేగా’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడని సచిన్ టెండూల్కర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అప్పుడు ఇండియా, పాకిస్థాన్ ఎవరైనా.. గేమ్‌లోనే పోరాటం కనబర్చేవారని.. తర్వాత ఫ్రెండ్స్‌గా ఉండేవారని సచిన్ మాటల్లో అర్థమవుతుంది.

సహారా కప్‌లో టీం ఇండియా గెలిచింది. సచిన్ కెప్టెన్సీ చేయడంతో తన బ్యాటింగ్ దెబ్బతినే అవకాశం ఉందనే కారణంతో కెప్టెన్సీకి దూరమై దాదా సౌరవ్ గంగూలీకి సారథ్య బాధ్యతలు అప్పగించాడు. అప్పటి నుంచి టీం ఇండియా జైత్రయాత్ర కొనసాగింది. 2003 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాపై ఓడిపోయి కప్ చేజార్చుకుంది. కానీ ఆ తర్వాత నుంచి చాలా సక్సెస్ ఫుల్‌గా రాణిస్తూ ఎన్నో విజయాలతో ప్రపంచంలోనే భారత్ బలమైన జట్టుగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *