Anniversary of Saibaba Temple
Anniversary of Saibaba Temple

Anniversary of Saibaba Temple: ఘనంగా సాయిబాబా ఆలయ వార్షికోత్సవం: పాల్గొన్న ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్

Anniversary of Saibaba Temple: నిర్మల్, ఫిబ్రవరి 1 (మన బలగం): ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని సద్గురు శ్రీ సాయిబాబా ఆలయ 28వ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో సద్గురు సాయి బాబా విగ్రహానికి పాలాభిషేకం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయ వార్షికోత్సవానికి తనవంతుగా 40 క్వింటాళ్ల బియ్యం అందజేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సద్గురు శ్రీ సాయిబాబా ‘సబ్ కా మాలిక్ ఏక్’ అనే నినాదంతో సర్వ మతాల దేవుళ్లు ఒకరేనని ప్రపంచానికి చాటి చెప్పారని తెలిపారు. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. ప్రజలపై సాయిబాబా ఆశీస్సులు ఉండాలని, పాడిపంటలు బాగా పండాలని, ప్రపంచమంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Anniversary of Saibaba Temple
Anniversary of Saibaba Temple

Khanapur MLA Vedma Bojju Patel
Khanapur MLA Vedma Bojju Patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *