Yashoda senior doctor Prabhakar: నిర్మల్, జూన్ 20 (మన బలగం): ఎలాంటి వ్యాధులనైనా ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స సులభం అవుతుందని యశోద ఆసుపత్రి సికింద్రాబాద్ బ్రాంచ్ వైద్యులు ప్రభాకర్ అన్నారు. నిర్మల్ పట్టణంలోని ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వాస్కులర్ వ్యాధి ఎంత ప్రమాదకరమో దాన్ని ప్రారంభ దశలో గుర్తిస్తే అంత సులువుగా చికిత్స చేసుకునే అవకాశం ఉందన్నారు. చివరి దశ వరకు వ్యాధిని గుర్తించకపోవడం వల్ల ప్రభావం తీవ్రంగా ఉంటుందని, తద్వారా వైద్య ఖర్చులు పెరుగుతాయని అన్నారు. వాస్కులర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు ప్రతి జిల్లాలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ప్రభాకర్ అన్నారు. తమ ఆసుపత్రిలో అధునాతన వైద్య పరికరాలచే వాస్కులర్ వ్యాధికి చికిత్స అందడం అందించడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వాస్కులర్ వ్యాధికి సంబంధించి చికిత్స పొందిన దస్తూరాబాద్ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన మల్లయ్య తన అనుభవాలను తెలిపారు. తన కాలును పూర్తిగా తొలగించాలని ఇతర ఆసుపత్రుల్లో తెలుపగా తాను యశోద ఆసుపత్రికి వెళ్లడం వల్ల ఈరోజు వ్యాధి నయం చేసుకొని తనకు తాను నడవగలుగుతున్నానని అన్నారు.