Koppula Eshwar: ధర్మపురి, జనవరి 28 (మన బలగం): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జగిత్యాల జిల్లాలో జరుగుతున్న సమీకరణాలు, దురంపూడి నియోజకవర్గంలో జరుగుతున్న సమీకరణాల గూర్చి సుదీర్ఘంగా చర్చించారు. రాబోవు రోజుల్లో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, కార్యకర్తలకు అండగా ఉండాలో చర్చించారు. రాబోవు రోజుల్లో స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతి గ్రామంలో గెలిచే విధంగా రూపకల్పన చేసి ముందుకు సాగాలని సూచించారు.