Congress Adilabad Parliamentary: నిర్మల్, జనవరి 4 (మన బలగం): రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని తెలిపారు. ఈనెల 6వ తేదీన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్లమెంటరీ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షి, పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడమ బొజ్జు హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికలపై విశ్లేషణ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ ఉంటుందని పేర్కొన్నారు.