Jagityala District SP: జగిత్యాల, డిసెంబర్ 26 (మన బలగం): జగిత్యాల జిల్లాలో ఈ ఏట నేరాల సంఖ్య కొద్దిగా పెరిగినా శాంతి భద్రతల పరిరక్షణలో జిల్లా పోలీస్ యంత్రాంగం సక్సెస్గా నిలిచిందని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. గురువారం ఎస్పీ ఆఫిస్లో నేరాల తీరుపై వార్షిక నివేదికను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో గతంకంటే కేసుల సంఖ్య పెరిగినప్పటికీ శాంతిభద్రత విషయంలో భాగానే ఉందని అన్నారు. జిల్లాలో 2023లో 4 వేల 999 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 5 వేల 9వందల 19 కేసులు నమోదయ్యాయని అన్నారు. అత్యధికంగా జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో 791 కేసులు నమోదైతే అతి తక్కువగా బీర్పూర్ స్టేషన్లో 120 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. హత్య కేసులు 28, హత్యాచారా యత్నం కేసులు గతం కంటే తగ్గాయని చెప్పారు. ఈ ఏడాది 40 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు గతేడాదికంటే తగ్గాయని చెప్పారు. ఈ ఏడాది 451 కేసులు నమోదైనట్లు తెలిపారు.