- మహోజ్వల పోరాటాలు, త్యాగాల చరిత్ర కలిగిన 100 సంవత్సరాల ఏకైక రాజకీయ పార్టీ సీపీఐ
- సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి
- జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఆవిర్భావ వేడుకలు
Grand CPI centenary celebrations: కరీంగనర్, డిసెంబర్ 26 (మన బలగం): భారతదేశ గడ్డపై మహోజ్వల పోరాటాలు, త్యాగాల చరిత్ర కలిగిన పార్టీ సీపీఐ అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. గురువారం భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ)100వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా సీపీఐ జెండాలు ఎగురవేసి, కేక్లు కట్ చేసి, ర్యాలీలు నిర్వహించి ఘనంగా వేడుకలు నిర్వహించినట్లు వెంకటస్వామి తెలిపారు. కరీంనగర్లోని గీతా భవన్ చౌరస్తా నుంచి 100 జండాలతో రెడ్ షర్ట్ వాలంటీర్లతో ర్యాలీగా బయలుదేరి బస్టాండ్, కూరగాయల మార్కెట్, రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తా, కమాన్ చౌరస్తా మీదుగా సీపీఐ జిల్లా కార్యాలయం, బద్దం ఎల్లారెడ్డి భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కార్యాలయంపై సీపీఐ పతాకాన్ని మర్రి వెంకటస్వామి ఎగురవేశారు. 100 సంవత్సరాల వేడుకల సందర్భంగా సుదీర్ఘ కాలం సీపీఐలో పనిచేస్తూ అనేక ప్రజా సమస్యలపై ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించి నేటికీ సీపీఐలో క్రియాశీలక సభ్యత్వం కలిగి ఉండి ఎందరికో ఆదర్శంగా నిలిచిన సీనియర్ నాయకులను మర్రి వెంకటస్వామితో పాటు జిల్లా పార్టీ నాయకత్వం ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ భారతదేశంలో స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అని పోరాటాలు జరుగుతున్న క్రమంలో 1925 డిసెంబర్ 26న ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్లో సీపీఐ ఆవిర్భవించిందని, దేశంలో దోపిడీ లేని, అంతరాలు లేని సమ సమాజ స్థాపన కోసం పెట్టుబడి దారి విధానాలకు వ్యతిరేకంగా కార్మిక, కర్షక, ప్రజా దోపిడీకి పాల్పడుతున్న వర్గాలకు వ్యతిరేకంగా మార్క్స్ సిద్ధాంతాన్ని ఆచరిస్తూ నిరంతరం అన్ని రంగాల కార్మిక శ్రేయస్సు కోసం ఉద్యమాలు పోరాటాలు నిర్వహించి ఎన్నో విజయాలు సాధించిన పార్టీ సీపీఐ అని, వేలాదిమంది అమరవీరుల త్యాగాల ఫలితంగా నేటికీ సీపీఐ మనుగడ కొనసాగుతుందని, దేశంలో 530 కి పైగా ఉన్న సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయాలని పోరాటాలు నిర్వహించినదాని, వర్గ దోపిడీకి పాల్పడే వారి గుండెల్లో రైళ్లు పరిగెట్టించే పార్టీ సీపీఐ అని అన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత కార్మికులకు అన్ని వర్గాల ప్రజలకు, భారత రాజ్యాంగానికి లోబడి పౌరులకు హక్కులు కావాలని, భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరీ విముక్తి కోసం దేశ పాలకులపై అనేక పోరాటాలు నిర్వహించిన పార్టీ సీపీఐ అని, దేశంలో రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, భూ సంస్కరణలు చట్టం లాంటి అనేక ప్రజలకు ఉపయోగపడే విధంగా సీపీఐ పోరాటాలు నిర్వహించి సాధించిన విజయాలుగా చెప్పవచ్చని, దేశంలో ఉన్న ప్రజానీకం స్వేచ్ఛగా తమ హక్కుల కోసం ప్రశ్నించే తత్వాన్ని కలిగించినది ఎర్రజెండా నేననిపార్టీ. దేశంలో 100 సంవత్సరాలు నిండిన ఏకైక పార్టీ సీపీఐ అని, కాంగ్రెస్ పార్టీ కూడా అది ఇందిరా కాంగ్రెస్ అని, దేశంలో ఒకపక్క లెఫ్టి స్ట్ మరో ప్రక్క రైటిస్ట్ మతోన్మాదంతో హిందూయిజాన్ని అడ్డం పెట్టుకొని రెచ్చగొట్టే విధంగా ఉండే ఆర్ఎస్ఎస్ ఒక్కటే 1925లో ఆవిర్భవించిందని వెంకటస్వామి అన్నారు.
1925లో ఆవిర్భవించిన సీపీఐ 2025 నాటికి 100 సంవత్సరాలు పూర్తి అవుతాయని నేటి నుంచి సంవత్సరం పాటు సీపీఐ 100 సంవత్సరాల ఉత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటామని, 100 సంవత్సరాల ఉద్యమాలను పోరాటాలను, విజయాలను ప్రజలకు వివరిస్తూ మరింత పట్టుదలతో సీపీఐ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తూ ముందుకు వెళతామని వెంకటస్వామి తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బోయిని అశోక్, జిల్లా కౌన్సిల్ సభ్యులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, పైడిపెల్లి రాజు, కిన్నెర మల్లవ్వ, పంజాల శ్రీనివాస్ నలువాల సదానందం, సాయవేణి రాయమల్లు, బ్రామాండ్ల పెల్లి యుగేందర్, బూడిద సదాశివ, బోనగిరి మహేందర్, న్యాలపట్ల రాజు, బోయిని తిరుపతి, పిట్టల సమ్మయ్య, గొడిశీల తిరుపతి గౌడ్, మచ్చ రమేష్, రామారపు వెంకటేష్, లంకదాసరి కళ్యాణ్, గోవిందుల రవి, నాయకులు మురళీ, సంపత్, అంజలి, రమ, హేమంత్, సాగర్, రాము, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.