BJP Gollapally
BJP Gollapally

BJP Gollapally: ధర్మ రక్షకులను గెలిపించాలి

BJP Gollapally: గొల్లపల్లి, నవంబర్ 20 (మన బలగం): గొల్లపల్లి మండలం మల్లన్న పేట గ్రామంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ముడుపు కట్టారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ధర్మపురి అసెంబ్లీ కన్వీనర్ కొమ్ము రాంబాబు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ ఫలాలను గ్రామ గ్రామానికి అందించాలని స్థానిక కార్యకర్తలకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా ప్రచారం చేయాలన్నారు. జిల్లా అధికార ప్రతినిధి మర్రిపల్లి సత్యం మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను పార్టీ కార్యకర్తలు అందరూ గెలిపించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. మండలాధ్యక్షులు కట్ట మహేశ్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలో ధర్మ రక్షకులను గెలిపించాలని మల్లికార్జున స్వామికి ముడుపు కట్టారు. అనంతరం గ్రామంలోని పలు వార్డులలో ప్రజలను కలిసి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సింహాచలం సత్యనారాయణ గండ్ర ప్రసాద్ రావు, బైరం నారాయణ, అనుమల రాఘవరెడ్డి, కస్తూరి లక్ష్మారెడ్డి, బీజేపీ మండల ఉపాధ్యక్షులు భీమ మహేశ్, మండల కార్యదర్శి కోట తిరుపతి, అసెంబ్లీ కన్వీనర్ కోకో లక్ష్మణ్, ఐటీ సెల్ కన్వీనర్ గాజుల శ్రీధర్, స్థానిక నాయకులు దాసరి మల్లయ్య, బండారి నరేశ్, గుండ లచ్చన్న, దళిత మోర్చా మండల ప్రధాన కార్యదర్శి మొరపల్లి బాలయ్య, మండల యువ నాయకులు ప్రేమ్, శివాజీ, ముత్యాల స్వామి, మండల యువమోర్చా అధ్యక్షులు లక్కాకుల వెంకటేశ్, బూత్ అధ్యక్షులు బత్తుల శ్రీను, సిద్దుల రాజేశం బీసగొని రాము గౌడ్, ముత్యాల గంగాధర్ బీజేపీ స్థానిక నాయకులు మండల నాయకులు జిల్లా నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *