శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ అభిలాష అభినవ్
Best off Luck: నిర్మల్, డిసెంబర్ 24 (మన బలగం): ఈనెల 27న హైదరాబాద్లో జరగనున్న రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలలో పాల్గొనే విద్యార్థులకు మంగళవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా నుంచి 550 మంది రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొనబోతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో జరిగిన పోటీలలో ఉత్తమ ప్రదర్శన కనబరిచారని అభినందించారు. రాష్ట్రస్థాయిలో జరిగే క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాను మెరుగైన స్థానంలో నిలపాలని తెలిపారు. విద్యార్థులకు టీషర్ట్లు, టోపీలు కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి, ఎస్జీఎఫ్ సెక్రెటరీ రవీందర్ గౌడ్, పీఈటీ సెక్రటరీ భోజన, పీడీ భూమన్న, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.