Pre Sankranti celebrations: తానూర్, జనవరి 10 (మన బలగం): తానూర్ మండల కేంద్రంలోని వాసవి పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్ సంక్రాంతి పండుగ ప్రాశస్త్యాన్ని వివరించారు. సంక్రాంతి పండుగ అనేది ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోనికి అనగా మకరరాశిలోకి ప్రవేశిస్తాడని తెలిపారు. దీనికి ప్రతీకగా సంక్రాంతి పండుగ జరుపుకుంటామని వెల్లడించారు. రైతులు పండించిన పంటలు ఈ సమయానికి చేతికొస్తాయు కాబట్టి సంతోషంతో ఈ పండుగను జరుపుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో డైరెక్టర్ నర్సయ్య, ఉపాధ్యాయులు సుధీర్, ప్రియాంక, పూజ, పుష్ప శ్రీ, మమత, ప్రతిక్ష్య, నీరజ, నవనీత, అఖిల, రూప, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.