- కటకం మృత్యుంజయం బాధితుల నిరసన
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదుకోవాలని వినతి
We have a life threat with the former MLA: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 6 (మన బలగం): సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహం దగ్గర మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం బాధితులు శుక్రవారం నిరసన తెలుపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంభీరావ్పేట మండలంలో మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం పేదల భూములను కబ్జా చేస్తున్నాడని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నాడని, ఖాళీ భూమి కనిపిస్తే చాలు లిటికేషన్ సృష్టించి కబ్జా చేస్తున్నాడని ఆరోపించారు. 50 సంవత్సరాల నుంచి ఉంటున్న ఇండ్లను కూల్చివేస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతని అరాచకాలతో చాలామంది మరణించారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని విన్నవించారు. వ్యాపారవేత్తల వద్ద మెటీరియల్ తీసుకొని డబ్బులు అడిగితే చంపుతానని గన్తో బెదిరిస్తున్నాడని తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తన కోసం నాలుగు సార్లు కాల్ చేశాడంటూ, కలెక్టర్తో మాట్లాడాను అంటూ… గౌరవ కలెక్టర్పైన మృత్యుంజయం దురుసుగా మాట్లాడుతున్నాడని తెలిపారు. గంభీరావుపేట్ సెటిల్మెంట్లో తాను ఒక ఫోన్ చేస్తే బొచ్చు నాలుగు లక్షలు ఇస్తారు అంటూ బెదిరిస్తున్నాడని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దయతలచి కటకం మృత్యుంజయంపై విచారణ కమిటీ వేసి న్యాయం చేయాలని కోరారు. బాధితులు భోజన్న గారి శంకర్, కొప్పు అమృత, మారవేణి దేవలక్ష్మి, ఐత సంతోష్, మహబూబ్, మెట్పెల్లి ఆంజనేయులు, ఆంజనేయులు రాజు, చిట్టిపల్లి నాంపల్లి, మేకర్తి మల్లేశం, మిట్టపెలి బాలరాజు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారులు మారవేణి రంజిత్ కుమార్ ఉన్నారు.