Mid day meals
Mid day meals

Mid day meals: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

Mid day meals: ఎల్లారెడ్డిపేట, జనవరి 10 (మన బలగం): పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యమైనదిగా ఉండాలని నిర్వాహకులకు ఎల్లారెడ్డిపేట అధికారులు, కాంగ్రెస్ నాయకులు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అధికారులతో కలిసి కాంగ్రెస్ నాయకులు భోజనాన్ని పరిశీలించారు. భోజనాన్ని పరిశీలించిన వారిలో ఎంపీడీవో సత్తయ్య, డిప్యూటీ తాసిల్దార్ సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా నాయకులు షేక్ గౌస్, చెన్ని బాబు, గుండాడి రామ్ రెడ్డి, నంది కిషన్, మెండే శ్రీను తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *