Vaikuntha Ekadashi: ఎల్లారెడ్డిపేట, జనవరి 10 (మన బలగం): వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సామేత వేణుగోపాల స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఆలయకమిటీ ఆధ్వర్యంలో ఉత్తర ద్వారా దర్శనానికి భక్తులు వేకువజాము నుంచే క్యూ కట్టారు. గొల్లపల్లి, నారాయణపూర్ తదితర గ్రామాల్లోని ఆలయాల్లో సైతం ఉత్తర ద్వారా దర్శనానికి భక్తులు బారులు తీరారు. పలువురు ప్రజాప్రతినిధులు ఆలయాల్లో ప్రత్యేక దర్శనాలు చేసుకున్నారు.