Journalists protest
Journalists protest

Journalists protest: జగిత్యాలలో జర్నలిస్టుల అర్ధనగ్న ప్రదర్శన

Journalists protest: ప్రజా ప్రతినిధులు జర్నలిస్టుల చెవిలో పూలు పెడుతున్నారని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు విమర్శించారు. స్థానిక ఆర్డీవో ఆఫీసు ముందు దీక్ష చేస్తున్న జర్నలిస్టులు చెవిలో పూలు పెట్టుకొని, స్థానిక తహసీల్దార్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ.. 11 రోజుల నుంచి నిరసన దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్ట్‌లు అందరూ పేద, మధ్యతరగతికి చెందిన వారేనని అన్నారు. అరకొర వసతులతో, ఇంటి రెంట్ కూడా కట్టే పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ పరంగా రావలసిన ఇండ్లస్థలాల కోసమే పోరాటం చేస్తున్నామన్నారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోతే గల్లి నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. వెంటనే ప్రజాప్రతినిధులు పట్టించుకొని వెంటనే ఇండ్ల స్థలాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *