- మున్సిపల్ కమిషనర్పై చర్యలు తీసుకోవాలి
- బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్న కమిషనర్: సీపీఐ
Formers on stage: కరీంనగర్ నగరంలో ఎంపీ బండి సంజయ్ నిధులతో మున్సిపల్ కార్యాలయంలో డ్రిల్లింగ్ మిషన్ల పంపిణీ అధికారిక కార్యక్రమంలో వేదికపై బీజేపీకి చెందిన మాజీ మేయర్ సునీల్ రావు, డి.శంకర్ కొంతమంది మాజీ కార్పొరేటర్లూ వేదికపై ఉండటం వేదికపై సీట్లలో కూర్చోవడానికి ఆహ్వానించిన నగరపాలక కమిషనర్పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి నగర సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు డిమాండ్ చేశారు. ఇష్టారాజ్యంగా బీజేపీకి చెందిన నాయకులను కమిషనర్ వేదికలపై పిలిచి ప్రజలను అవమానపరుస్తున్నారని బీజేపీ కార్యక్రమాల్లాగా అధికార కార్యక్రమాలు కమిషనర్ నిర్వహించడం సిగ్గుచేటన్నారు.
పదవి కాలం పూర్తయిన ఇంకా మాజీ మేయర్, కొందరు కార్పొరేటర్లు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో వేదికలపై పాల్గొనకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, మున్సిపల్ కార్యాలయంలో 60 మంది కార్పొరేటర్ల పదవి కాలం పూర్తయిన బోర్డుపై ఉన్న వారి పేర్లు ఇంకా తొలగించడం లేదని వెంటనే వాటిని తీసేయాలని సురేందర్ రెడ్డి, రాజు డిమాండ్ చేశారు.