Honor to the Presidents of Ayyappa Temple Committee: ఇబ్రహీంపట్నం, జనవరి 2 (మన బలగం): జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయ వ్యవస్థపకులు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు-సరోజమ్మ ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వాహక అధ్యక్షులుగా గంగుల వివేక్, ఆలయ కమిటీ అధ్యక్షులుగా దోమ్మటి ప్రవీణ్లను నియమించారు. గురువారం పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో వివేక్, ప్రవీణ్లను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అంకతి భరత్ కుమార్, ఉజ్జగిరి శ్రీనివాస్, గుజ్జే గంగాధర్, అరె రమేశ్, బాజవేని వెంకటేశ్, కోళిపాక రాజు, ఎలిగేటీ కృష్ణా, గంగ శ్రీనివాస్, కోటగిరి తిరుమల్, కోట బుచ్చి గంగాధర్, చెపురి రాము, పుప్పాల రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.