purchasing centers: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 7 (మన బలగం): రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంతోపాటు పలు గ్రామాలలో ఐకేపీ కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ రాములు, వైస్ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ ఎమ్మార్వో ముస్తాక్ పాషా, మాజీ ఎంపీటీసీ అరుణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ ఏఎంసీ డైరెక్టర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులను ఆదుకోవడమే ప్రజా పాలన ప్రభుత్వం యొక్క లక్ష్యం అని ప్రతి గింజను కొనుగోలు చేసి ఆదుకుంటామని అన్నారు.