Markandeya Jayanti
Markandeya Jayanti

Markandeya Jayanti: నిర్మల్‌లో ఘనంగా మార్కండేయ జయంతి

Markandeya Jayanti: నిర్మల్, ఫిబ్రవరి 1 (మన బలగం): నిర్మల్ పట్టణంలో శనివారం మార్కండేయ జయంతిని పద్మశాలీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహాలక్ష్మివాడ, బంగల్‌పేట్, నాయిడివాడ, బాగులవాడలో మార్కండేయ మహర్షి జయంతి ఉత్సవాలు నిర్వహించారు. మహాలక్ష్మివాడ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో పద్మశాలీ సంఘం అధ్యక్షులు రాములు, కోశాధికారి రాజేశ్, ప్రధాన కార్యదర్శి ఎనగందుల నరేశ్ తదితర కమిటీ సభ్యులు మార్కండేయుని చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలీల ఐక్యత వర్ధిల్లాలని పేర్కొన్నారు. పద్మశాలీల పండుగలను అందరూ కలిసికట్టుగా నిర్వహించుకొని మన ఐక్యత చాటాలని సూచించారు. భవిష్యత్తులో పద్మశాలీలు రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరారు. కార్యక్రమాల్లో పద్మశాలి సంఘం డబల్ బెడ్ రూమ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Markandeya Jayanti
Markandeya Jayanti

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *