Missing woman: ముధోల్, జనవరి 25 (మన బలగం): ముధోల్ మండలంలోని బోరిగా గ్రామానికి చెందిన మహిళ ఎండల లలిత తన భర్తతో గొడవ పెట్టుకుని 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. భర్త ఎండల చిన్న నర్సయ్య చుట్టుపక్కల గ్రామాలన్నీ వెతికాడు. ఎక్కడా జాడ తెలియలేదని ఫిర్యాదు ఇవ్వగా ముధోల్ ఎస్ఐ సంజీవ్ మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. వెంటనే ఎండల లలిత ఆచూకీ కోసం ఒక బృందంగా బయలుదేరి ఫకీరాబాద్లో ఆమెను సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో పట్టుకొని కౌన్సిలింగ్ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ విషయంపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ముధోల్ పోలీస్ వారిని అభినందించారు.