Minister Konda Surekha: ధర్మపురి, జనవరి 4 (మన బలగం): రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను సచివాలయంలో శనివారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు, అధికారులతో కలిసి ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ప్రసాదాన్ని, స్వామి వారి ఫొటోను మంత్రికి అందజేసారు. ఈ నెల 10వ తేదీన ధర్మపురి పుణ్య క్షేత్రంలో నిర్వహించే ముక్కోటి ఏకాదశి మహోత్సవానికి రావాల్సిందిగా మంత్రిని ఆహ్వానించారు.