Mokudebba Mahasabha on 6th
Mokudebba Mahasabha on 6th

Mokudebba Mahasabha on 6th: 6న నిర్మల్‌లో మోకుదెబ్బ జిల్లా 4వ మహాసభలు

  • కల్లు గీత వృత్తి రక్షణకు ఐక్య ఉద్యమాలు
  • జాతీయ అధ్యక్షులు అమరవేణి నర్సాగౌడ్

Mokudebba Mahasabha on 6th: నిర్మల్, నవంబర్ 2 (మన బలగం): నిర్మల్ జిల్లా కేంద్రంలోని గౌడ సంఘ భవనంలో గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ నిర్మల్ జిల్లా ముఖ్యనాయకుల సమావేశం మాజీ జిల్లా అధ్యక్షులు ప్లావల గోపి గౌడ్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ అధ్యక్షులు అమరవేణి నర్సాగౌడ్, రాష్ట్ర కమిటీ నాయకులు పడాల రాజేందర్ గౌడ్, కొండ బాలగౌడ్, తీగెల వెంకట్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్లు గీత వృత్తి రక్షణ, గౌడ కుల దామాషా ప్రకారం రాజకీయ వాటా కోసం గౌడ కులస్తులు పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఐక్య ఉద్యమాల ద్వారానే హక్కుల సాధన సాధ్యమవుతుంది అన్నారు. కల్లుగీత వృత్తి రక్షణ గౌడ కులస్తుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 6 బుధవారం ఉదయం 10 గంటలకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంఘ భవనంలో నిర్మల్ జిల్లా 4వ మహాసభలను నిర్వహించనున్నట్లు తెలిపార. మహాసభలకు జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లోని గౌడ కులస్తులు, గీత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు శివ్వొల్ల రవీందర్ గౌడ్, తీగెల శ్రీనివాస్ గౌడ్, గడ్డం మహేందర్ గౌడ్, పీసర శ్రీనివాస్ గౌడ్, కందునూరి అశ్విన్ గౌడ్, కొండ రాజేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *