Road accident in Dubai: ధర్మపురి, డిసెంబర్ 3 (మన బలగం): ఉపాధి కోసం దుబాయి వెళ్లిన ధర్మపురి మండలంలోని గోవిందుపల్లె గ్రామానికి చెందిన వ్యక్తి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మపురి మండలం గోవిందుపల్లెకు చెందిన లెంకల గంగమల్లు (45) కొద్ది సంవత్సరాలుగా ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆరు నెలల క్రితం దుబాయి వెళ్లిన ఇతను డిసెంబర్ 25న దుబాయిలోని అలెన్ ప్రాంతంలో రహదారి నిర్మాణ పని చేస్తుండగా రోడ్డు రోలర్ ఢీకొనడంతో మృతి చెందాడు. మృతదేహం శుక్రవారం గ్రామానికి చేరనున్నట్లు స్థానికులు తెలిపారు.