AISF
AISF

AISF: బడ్జెట్‌లో విద్యారంగానికి మొండి చేయి: ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అక్రమాలిక్

AISF: జగిత్యాల ప్రతినిధి, మార్చి 20 (మన బలగం): విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో విద్యారంగానికి కేటాయించిన నిధులను చూస్తే అర్థమవుతుందని, ఇది ముమ్మాటికి విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం మేనని ఏఐఎస్ఎఫ్ జగిత్యాల జిల్లా కార్యదర్శి మొహమ్మద్ అక్రమ్ మాలిక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం ముందు తలదించుకొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేవలం 7.57 శాతం 0. 2 శాతం నిధులు కేటాయించడంలోనే విద్యారంగం పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తుశుద్ధి ఉందని తెలిసిందన్నారు. ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో డొల్లతనం కనిపిస్తుంది అన్నారు. కనీసం విద్యారంగానికి కేటాయించాల్సిన మినిమమ్ బడ్జెట్‌ను కూడా విద్యారంగానికి కేటాయించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టోలో కనీసం 15 శాతం నిధులు కేటాయిస్తామని చెప్పిన కాంగ్రెస్ గత సంవత్సరం ఈ సంవత్సరానికి 0.2 శాతం నిధులు కేటాయించడం దారుణం అని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఉన్నత విశ్వవిద్యాలయాలకు తక్కువ నిధులు కేటాయించడం సరికాదన్నారు.

పెండింగ్ స్కాలర్‌షిప్స్, ఫీజురీయింబర్స్‌మెంట్ గురించి ప్రస్తావన లేదని ఆయన విమర్శించారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాల కోసం సుమారుగా 11 వేల 6 వందల కోట్ల రూపాయలను కేటాయిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కస్తూర్బా ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం ఊసే లేదని, డిగ్రీ కళాశాలలు, ఇంటర్నేషనల్ పాఠశాలలు, స్వంత భవనాలకు నిధులు లేవన్నారు. ఈ నిధులు విద్యా అభివృద్ధి కోసం కాదు, విద్యా దారిద్య్రానికి దారి తీస్తాయని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి 30 శాతం అధిక నిధులు కేటాయించి విద్యారంగా అభివృద్ధికి పేద విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని ఆయన కోరారు. లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మంద రాకేష్, పట్టణ అధ్యక్షులు మహేష్, రూరల్ మండల అధ్యక్షులు అంకటి ప్రణయ్, పట్టణ నాయకులు సాయి చరణ్, జిల్లా సమితి సభ్యులు అరవింద్, మనోజ్, గర్ల్స్ విభాగం ప్రవళిక, సుష్మా, సింధూ, రవళి, జ్యోత్స్న, అక్షయ, తన్మయి, రష్మిక తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *