Distribution of Kalyan Lakshmi Cheques
Distribution of Kalyan Lakshmi Cheques

Distribution of Kalyan Lakshmi Cheques: పేద ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం: ఏఎంసీ అధ్యక్షురాలు సబేరా బేగం

Distribution of Kalyan Lakshmi Cheques: ఎల్లారెడ్డిపేట, జనవరి 8 (మన బలగం): పేద ప్రజల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందని బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ సబేరా బేగం అన్నారు. బుధవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. కార్యక్రమం తహసిల్దార్ రామచంద్రం ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉందని అన్నారు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలానికి 1 కోటి 41 లక్షల రూపాయల చెక్కులను అందజేసి మొదటి స్థానంలో నిలవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు అభివృద్ధి చేస్తూనే మరోవైపు సంక్షేమ పథకాలు అమలుపరుస్తున్నారని అన్నారు. రైతులకు రుణమాఫీతో పాటు సన్నవడ్లకు 500 బోనస్‌ను కూడా ఇవ్వడం జరిగిందన్నారు. అంతే కాకుండా జనవరి 26 నుండి రైతు భరోసాను సంవత్సరానికి 12000 వేస్తూ భూమిలేని నిరుపేద కుటుంబాలకు సంవత్సరానికి 12 వేల రూపాయలు వేస్తామని అన్నారు. దీనిని ఇందిరమ్మ భరోసాగా పిలవడం జరుగుతుందన్నారు.

కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాట రామ్ రెడ్డి, సస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, పి ఎస్ ఎస్ సి చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, తిమ్మాపూర్ పిఎస్ఎస్సి వైస్ చైర్మన్ బుగ్గ కృష్ణమూర్తి, డైరెక్టర్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య నాయకులు ఎస్కే సాహెబ్ షేక్ గౌస్ మరియు శ్రీనివాసరెడ్డి గంట బుచ్చగౌడ్ చెన్ని బాబు బండారి బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామాల వారీగా ఎల్లారెడ్డిపేట 13, వెంకటాపూర్ 12 , రాచర్ల తిమ్మాపూర్ 15, సింగారం 2, రాజన్నపేట 7, పోతిరెడ్డిపల్లి 2, పధిర 6, నారాయణపూర్ 13, కోరుట్ల పేట 5, రాచర్ల గుండారం 6, రాచర్ల గొల్లపల్లి 20, దుమాల 5, రాచర్ల బొప్పాపూర్ 16, బండలింగంపల్లి 8, అల్మాస్పూర్ 9, అక్కపల్లి 2 చెక్కులను పంపిణీ చేయనున్నారని అన్నారు. మండలంలో 141 మంది లబ్ధిదారులకు ఈ చెక్కులను అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *