Vaikunta Ekadashi: ఇబ్రహీంపట్నం, జనవరి 10 (మన బలగం): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగాజరిగాయి. ఈ సందర్భంగా గ్రామాల్లోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి, గోపాలకృష్ణ స్వామి తదితర ఆలయాల్లో ఆలయకమిటీలు స్వామి వారి ఉత్తరద్వారం దర్శనం ఏర్పాట్లు చేశారు. మహిళలు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఆలయంలో స్వామి వారి పల్లకీ సేవ నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా 26వ పార్షం చెప్పి అర్చకులు నక్షత్ర హారతి, పంచ హారతి, కర్పూర హారతులు ఇచ్చి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసారు. కార్యక్రమంలో ఆలయకమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.