Distribution of pens: మల్యాల, జూన్ 20 (మన బలగం): చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి ప్రథమ వర్ధంతి సందర్భంగా మల్యాల మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని 550 మంది విద్యార్థులకు వ్యవసాయ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ మల్లీశ్వరి ఆధ్వర్యంలో పెన్నులు, నోటుబుక్కులు పంపిణీ చేశారు. రాజారాం గ్రామంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఫలహారాలు పండ్లు, స్నాక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ మల్లేశ్వరి గౌడ్, కాంగ్రెస్ యువజన మండల అధ్యక్షులు శనిగారపు తిరుపతి, సింగిల్విండో చైర్మన్ తొట్ల చంద్రశేఖర్, మేక లక్ష్మణ్, బండి రవి గౌడ్ బి.వి.రమణ, మిలిటరీ శ్రీనివాస్, బక్కి శెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.
