Sehwagh comments on mi team
Sehwagh comments on mi team

Sehwagh: ముంబయి టీం వారందరినీ విడిచిపెడుతుంది : సెహ్వాగ్

Sehwag: ముంబయి ఇండియన్స్ స్టార్లతో కూడిన టీం. కానీ ఈ ఐపీఎల్ సీజన్‌లో పేలవ ప్రదర్శనతో చివరి స్థానంలో నిలిచింది. హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా చేసిన తర్వాత జట్టులో లుకలుకలు మొదలయ్యాయి. ఇషాన్, రోహిత్, సూర్య లాంటి ప్లేయర్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయారు. దీంతో జట్టు సీజన్‌లో ఒక్క మ్యాచ్ మిగిలి ఉండగా కేవలం నాలుగింట్లో విజయం సాధించి 9 మ్యాచుల్లో ఓడిపోయింది.

ముంబయి ఆటగాళ్లు ఎవరినీ యాజమాన్యం రిటైన్ చేసుకోకపోవచ్చు. బుమ్రా, సూర్యను మాత్రం రిటైన్ చేసుకుని మిగతా ప్లేయర్లు, విదేశీ ఆటగాళ్లను అందరినీ పక్కన పెడుతుందని సెహ్వాగ్ అన్నాడు. సెహ్వాగ్ ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముంబయి రాబోయే సీజన్‌లో అందరినీ విడిచిపెట్టే అవకాశం ఉంది. టీమ్‌లో ఎంతమంది స్టార్ ఆటగాళ్లు ఉన్నా.. బాగా ఆడాలని లేదు కదా అన్నాడు.

సినిమాల్లో స్టార్లు ఉన్నా బలమైన కథ, కథనం లేకపోతే సినిమా ఆడదు కదా అన్నాడు. అలాగే క్రికెట్‌లోనూ పేపర్ పులులు అవసరం లేదని సమయానికి తగినట్లు ఆడే ఆటగాళ్లు కావాలని సెహ్వాగ్ చెప్పాడు. ముంబయి హార్దిక్‌ను కూడా తొలగించి కెప్టెన్‌గా బుమ్రా లేదా.. సూర్యకు అప్పగించాలని సూచించాడు. దీనికి మనోజ్ తివారీ కూడా మద్దతు పలికాడు.

టీం బలంగా ఉండాలంటే బలమైన నాయకత్వం అవసరం. కానీ ముంబయి టీంలో అది లోపించింది. కాబట్టి కెప్టెన్సీ మార్పుతో పాటు ఆటగాళ్లను మార్చితేనే నెక్ట్స్ సీజన్‌లో విజయాలు సాధించే అవకాశం ఉంటుందని చెప్పాడు. సెహ్వాగ్ చెప్పిన విధంగా ముంబయి టీం అందరినీ విడిచిపెడుతుందా.. లేక ఏం చేస్తుందా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. కాబ్టటి ముంబయి ఇండియన్స్ టీంలో ఈ సీజన్‌లో పాల్గొన్న ఆటగాళ్లు నెక్ట్ సీజన్‌లో ఉండకపోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *