road accident
road accident

road accident: కోతులను తప్పించబోయి కారు బోల్తా: ఇద్దరి మృతి

road accident: నిర్మల్, జనవరి 18 (మన బలగం): నిర్మల్ నియోజకవర్గం మామడ మండలం బూరుగు పల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తా పడి ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్ నుంచి శ్రీశైలం వెళుతున్న ఈ కారు అడ్డుగా వచ్చిన కోతులను తప్పించే ప్రయత్నంలో బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో విజయ్(65) అక్కడికక్కడే మృతిచెందారు. సునీత(55) నిర్మల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

road accident
road accident

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *