ఆధునిక సదుపాయాలతో ముందుకు వెళ్తున్నాయని, రాజురా నుంచి పెంబి రోడ్డు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని, ప్రజల సొమ్ముతో జరిగే పనులను తన వ్యక్తి గతగా చూపించుకోవడం కాంగ్రెస్ పార్టీకి అలవాటైందని, ఎటువంటి కొత్త అభివృద్ధి పనులు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన పునాదుల మీదే ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఫొటోలు దిగుతూ క్రెడిట్ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్నీ మరచి, కేవలం తూతూ మంత్రంగా పర్యటనలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుతున్న అధికార పార్టీ నాటకాలకు ప్రజలు పూర్తిగా విసిగిపోయారని, అభివృద్ధి కన్నా ప్రచార యాత్రలకే ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అసలైన వైఖరిని బయటపెడుతోందని, ఇకనైనా తమ బుద్ధి మార్చుకొని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాజురా గ్రామ మాజీ ఉప సర్పంచ్ లింగన్న, నాయకులు షకీర్, గడ్డం శ్రీను, పెద్ది రాజు, బద్దిరాజు, నర్సయ్య, చందు, రామారావు, భీమేశ్, మదన్, లడ్డూ యాదవ్, వినోద్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.