BRS Party Strengthens Ahead of Local Elections in Khanapur: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు అంతా సిద్ధంగా ఉండాలని ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ చెప్పారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని సిరికొండ మండలం చిమన్ గుడి, ఫకీర్ నాయక్ తండాలో సోమవారం పర్యటించి, సమావేశంలో మాట్లాడారు. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని, ప్రతి గ్రామం అభివృద్ధి లక్ష్యంతో ముందుకు వెళ్లిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పాలన కొనసాగిస్తోందని, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తమ తమ గ్రామాలలో అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సిరికొండ మండల మాజీ ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
