Kharge effigy burning
Kharge effigy burning

Kharge effigy burning: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే దిష్టిబొమ్మ దహనం

Kharge effigy burning: ధర్మపురి, జనవరి 28 (మనం బలగం): కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడటాన్ని నిరసిస్తూ ధర్మపురిలో బీజేపీ నాయకులు బుధవారం ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్ మాట్లాడుతూ ఎవరి మనోభావాలు వారికి ఉంటాయని, ఇతరుల మనోభావాలను కించపరుస్తూ మాట్లాడడం సరికాదన్నారు. కుంభమేళా హిందువుల సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనమన్నారు. దీన్ని అవమానిస్తూ హిందువులను రెచ్చగొట్టే విధంగా ఖర్గే వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. మీకు ఇష్టమైతే కుంభమేళకు వెళ్లండి, లేక పోతే వెళ్లకుండి, కానీ హిందువులను కించపరుస్తూ మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మావోయిస్టుగా ఎంతో మంది ప్రాణాలు బలిగొన్న గద్దర్‌కు పద్మశ్రీ ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు కోరడం హాస్యాస్పదమన్నారు. గద్దర్ తన కుటుంబ సభ్యులనుఅమెరికా పంపించి అమాయక ప్రజలను అడవి దారి మళ్లించాడని ఆరోపించారు. రాజ్యాంగాన్ని అవహేళన చేసిన, ఎన్నికలు బూటకం అని అన్న వ్యక్తికి ఎలా పద్మ శ్రీ ప్రపోజ్ చేసారో కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గద్దర్ పద్మశ్రీకి ఏ విధంగా అర్హుడో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్, జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, ఓబీసీ మోర్చా కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు బెజ్జారపు లవన్ కుమార్, తిరుమందాస్ సత్యనారాయణ, దివిటి శ్రీధర్, మండలోజి సూరజు, ఆనందస్ నవీన్, బాకీ అనిల్, సుంకు మధుసూదన్, బండారి గణేశ్, కాశిట్టి హరీశ్, సోమిశెట్టి శివ సాయి, అప్పం శ్రీనివాస్, తోట శ్రీనివాస్, కలకుంట రాజు, నరసయ్య, మామిడి శ్రీకాంత్, తాటి కంటి హరీశ్ పాల్గొన్నారు.

Kharge effigy burning
Kharge effigy burning

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *