MLC elections
MLC elections

MLC elections: ఎన్నికల సామగ్రిని జాగ్రత్తగా భద్రపరచాలి: జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్

MLC elections: నిర్మల్, ఫిబ్రవరి 17 (మన బలగం): ఎమ్మెల్సీ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్. సోమవారం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలోని ఎమ్మెల్సీ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామగ్రి భద్రతపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఎన్నికల సామగ్రిని అత్యంత జాగ్రత్తగా భద్రపరచాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు జిల్లాకు చేరుతున్న సామగ్రి వివరాలను సంబంధిత రిజిస్టర్లలో జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. కార్యాలయంలో నిర్వహిస్తున్న పలు ఎన్నికల సామగ్రి రిజిస్టర్లను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ రత్నకళ్యాణి, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *